అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం, రుణ మాఫీ అందించాలని డిమాండ్ చేస్తూ, CPI & ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు కల్లూరు ఎమ్మార్వో ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి దంభోళం శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి నష్టపోయిన ఎకరాకు ₹50,000 నష్టపరిహారం ఇవ్వాలి,పంటలకు మద్దతు ధర కల్పించాలి,రైతు రుణాలు మాఫీ చేయాలి,ప్రభుత్వ అధికారులు గ్రామస్థాయిలో సర్వే చేసి రిపోర్టు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు