Download Now Banner

This browser does not support the video element.

విశాఖపట్నం: అజాగ్రత్తగా నడుపుతూ సిగ్నల్‌ను క్రాస్ చేయడంతో అదుపుతప్పి బోయపాలెం బ్రిడ్జిపై బోల్తా పడిన ద్విచక్ర వాహనం, తీవ్ర గాయాలు

India | Aug 23, 2025
ఆనందపురం మండలం బోయపాలెం బ్రిడ్జిపై శనివారం సాయంత్రం ఐదున్నర ప్రాంతంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది సమాచారం ప్రకారం ఒక మహిళ హెల్మెట్ పెట్టుకోకుండా అజాగ్రత్తగా ద్విచక్ర వాహనం నడుపుతూ సిగ్నల్‌ను క్రాస్ చేయడంతో వాహనం అదుపు తప్పి రోడ్డు పై బలంగా పడిపోయింది ఈ ఘటనలో ఆమె తలకు తీవ్ర గాయమయ్యింది అప్పటికే అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కే.మనోహర్ ప్రసాద్ పరిస్థితిని గమనించి వెంటనే స్పందింఛి అంబులెన్స్ ని రప్పించి ఆసుపత్రికి తరలించారు కాగా ఆమె ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
Read More News
T & CPrivacy PolicyContact Us