Download Now Banner

This browser does not support the video element.

భీమవరం: ప్రకాశ్‌నగర్‌లో మైదాన గిరిజనుల ధర్నా, డ్రైనేజీ, మంచినీరు, మరుగుదొడ్ల సమస్యలపై సిపిఎం ఆందోళన

Bhimavaram, West Godavari | Sep 5, 2025
భీమవరం 29వ వార్డు ప్రకాశ్‌నగర్‌లో డ్రైనేజీ, మంచినీరు, వ్యక్తిగత మరుగుదొడ్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మైదాన గిరిజనులు శుక్రవారం మధ్యాహ్నం 12:30 కు ధర్నా నిర్వహించారు. సిపిఎం టౌన్ నాయకులు మాట్లాడుతూ, ఎన్నిసార్లు కలెక్టర్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నాలు చేసినా సమస్యలు పరిష్కారం కాలేదని వాపోయారు. వర్షాకాలంలో నీరు రోడ్లపై నిల్వ ఉండి దోమలతో మలేరియా, టైఫాయిడ్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని తెలిపారు. ఎన్నికల సమయంలో ఓట్లు దండుకొని గెలిచిన తరువాత అధికారులకు మైదాన గిరిజనుల సమస్యలు పట్టడం లేదని మండిపడ్డారు.
Read More News
T & CPrivacy PolicyContact Us