డయేరియా తో న్యూ రాజరాజేశ్వరి పేట ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వంలో చలనం లేదని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు అన్నారు. శనివారం న్యూ రాజరాజేశ్వరి పేట ప్రాంతంలో ఆయన పర్యటించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ చిన్నారి, ఓ మహిళను బాబురావు వెంటబెట్టుకొని మెడికల్ క్యాంపు వద్దకు తీసుకువచ్చి ప్రత్యేక వైద్యం అందించారు. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని బాధితులకు నష్టపరిహారం అందించాలన్నారు