ప్రకాశం జిల్లా మార్కాపురం మీదుగా తిరుపతికి ప్రత్యేక రైలు ఏర్పాట్లు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ నుండి నవంబర్ 25 వరకు ఈ రైలు తిరుపతికి నడుపుతున్నట్టు పేర్కొన్నారు. ప్రతి మంగళవారం చర్లపల్లి నుంచి రాత్రి 9:10 గంటలకు బయలుదేరి జిల్లాలోని మార్కాపురం గిద్దలూరు స్టేషన్ల మీదుగా నంద్యాలకు చేరుతుంది అక్కడి నుంచి తిరుపతికి వెళుతుందని అధికారులు తెలిపారు.