గుమ్మగట్ట మండల కేంద్రంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత మెగా కంటివైద్య శిభిరం నిర్వహించారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ జరిగిన ఈ వైద్య శిబిరంలో సుమారు 200 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి కంటి ఆపరేషన్లకు వైద్యులు సిఫార్సు చేశారు. ఈ వైద్య శిభిరాన్ని రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవశ్రీనివాసులు తనయుడు కాలవ భరత్, స్థానిక సర్పంచి విజయలక్ష్మి, టీడీపీ మండల కన్వీనర్ గిరిమల్లప్ప, సదాశివ తదితరులు సందర్శించారు.