శ్రీకాకుళం జిల్లా మందస మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం 12:30 గంటలకు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆమె మాట్లాడుతూ... గత ప్రభుత్వ హయంలో అర్హులైన టిడిపి కార్యకర్తల పింఛన్లు తొలగించారని, కానీ నేడు పరిస్థితి లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అదేవిధంగా చొరవ చూపుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.