Download Now Banner

This browser does not support the video element.

ఉప్పాడ గ్రామంలో అసిస్టెంట్ కలెక్టర్ మనీషా సముద్రం కోతకు గురైన ప్రాంతాలను పరిశీలించారు.

Pithapuram, Kakinada | Sep 13, 2025
కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం ఉప్పాడ సమీపంలోని మాయాపట్నంలో అసిస్టెంట్ కలెక్టర్ మనీషా శనివారం ఉదయం 11 గంటలకు పర్యటించారు. సముద్రపు కోతకు గురైన రోడ్లు, ఇళ్లు, పాఠశాలను ఆమె పరిశీలించారు. తమ ఇబ్బందులను ప్రజలు ఆమెకు వివరించగా, కోతకు గురైన ఇళ్లలో నివసిస్తున్న వారికి రేషన్ పంపిణీకి ఆమె ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ధైర్యం చెప్పి, సమస్యను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us