నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటిగా మార్చేందుకు ప్రజల్లో చైతన్యం కలిగేలా సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ కోరారు. శనివారం నగరపాలక కార్యాలయంలో సామాజిక మాధ్యమాల ప్రభావితులతో ( సోషల్ మీడియా ఇన్ఫ్లెన్సర్లు) సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగర అభివృద్ధి, పరిశుభ్రత, పచ్చదనం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం వంటి అంశాల్లో ప్రజల్లో చైతన్యం కలిగించడానికి విస్తృత ప్రచారం అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మరింత బలపరిచేందుకు “We for Kurnool” పేరుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. ప్రజల్లో చైతన్య