చిట్వేల్ మండలంలో పలు గ్రామాల్లో బొప్పాయి తోటలను కలెక్టర్ చామకూరి శ్రీధర్ పరిశీలించారు. రెండు రోజులుగా బొప్పాయి రైతులు చేస్తున్న నిరసన స్థావరాలు కలెక్టర్ చేరుకొని వారితో సమావేశం నిర్వహించారు. ఏ ఒక్క రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో రాజంపేట సబ్ కలెక్టర్ భావన కోడూరు తహసిల్దార్ అమర్నాథ్, ఉద్యాన శాఖ అధికారులు పాల్గొన్నారు.