Download Now Banner

This browser does not support the video element.

కర్నూలు: రహదారుల విస్తరణ పనులు త్వరలో ప్రారంభం: కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ విశ్వనాథ

India | Aug 26, 2025
కర్నూలు నగరంలోని రహదారి విస్తరణ పనులను త్వరలో ప్రారంభించాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్ పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ఆయన ఉస్మానియా కళాశాల వద్ద విస్తరణ పనులు చేపట్టాల్సిన రహదారిని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. కిడ్స్ వరల్డ్ కూడలి నుంచి బుధవారపేట బ్రిడ్జి వరకు మాస్టర్ ప్లాన్ (ఆర్డీపి-2) ప్రకారం రహదారి విస్తరణ చేపట్టాల్సి ఉందన్నారు. ఇందుకోసం ఆస్తి ప్రభావిత యజమానులకు పరిహారం త్వరలో అందిస్తామని, మొత్తం 740 మీటర్ల పొడవున పనులు జరుగుతాయని, దాదాపు 183 యజమానుల ఆస్తులు ప్రభావితమవుతాయి.
Read More News
T & CPrivacy PolicyContact Us