శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లి క్రాస్ వద్ద నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి పనులను జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకుని పురోగతిని పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.