విశాఖపట్నం బీచ్ రోడ్డులోని గోడలు ఇటీవల అలల తాకిడికి దెబ్బతిన్నాయి. దీంతో, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ బీచ్ సుందరీకరణ పనులను చేపట్టింది. బుధవారం అధికారులు ఈ పనులను స్వయంగా పరిశీలించి పనుల పురోగతిని సమీక్షించారు. పర్యాటకులు, స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షం వల్ల పనులకు ఆటంకం ఏర్పడుతుందని, లేకపోతే ఈపాటికే పనులు పూర్తయ్యేవని అధికారులు తెలిపారు.