షామీర్పేట్ డిపో ఎదురుగా రాజీవ్ రహదారిపై సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. షామీర్పేటకు చెందిన భర్తపురం హరిబాబు బైక్ పై వెళ్తుండగా కోళ్ల వాహనం ఢీ కొట్టింది. ఈ క్రమంలో వ్యాన్ ముందు చక్రాల కింద బైక్ ఇరుక్కుపోవడంతో కొద్ది దూరం వరకు ఈచ్ కెళ్ళింది. ఈ ప్రమాదంలో హరిబాబు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసుల కేసు నమోదు చేశారు.