మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజ్వే శుక్రవారం మూడవ సారి ముంపునకు గురైంది. దీంతో మూడు గ్రామాల ప్రజలకు మళ్లీ వరద కష్టాలు ప్రారంభమయ్యాయి. కాజ్వేపై రెండు అడుగులకు పైగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో అప్పనపల్లి బాల బాలాజీ స్వామి దేవస్థానానికి వచ్చే భక్తులతో పాటు అప్పనపల్లి, బి.దొడ్డవరం, పెదపట్నంలంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద నీటిలోనే దిగి అష్ట కష్టాల నడుమ ప్రయాణం సాగిస్తున్నారు.