బిక్కనూరు మండలం జంగంపల్లికి చెందిన ఓ యువకుడు శుక్రవారం అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామానికి చెందిన శ్రావణ్ కుమార్ ఉదయం ఇంట్లో నుంచి ద్విచక్ర వాహనం తీసుకొని బయటకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరేసుకుని మృతి చెందినట్లు చెప్పారు. ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుని కుటుంబం సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.బిక్కనూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సమీక్షిస్తున్నారు.