డి.హిరేహాల్ మండలంలో సరిహద్దు ప్రాంతాల నుంచి ఇసుక కర్నాటక ప్రాంతాలకు యదేశ్చగా అక్రమ రవాణా అవుతోంది. హిర్దేహాల్ సమీపంలోని యల్లమ్మ కొండ వద్ద బయలు ప్రదేశంంలో కర్నాటక కు తరలించేందుకు సిద్ధంగా ఉన్న ఇసుక డంప్ ను గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో శనివారం రాత్రి ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి అక్కడికి చేరుకుని డంప్ స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.