ఎగువ అహోబిలంలో విరిగిపడ్డ కొండ చెరియలు,ఆళ్లగడ్డ మండలం ఎగువ అహోబిలం క్షేత్రంలోని మెట్ల మార్గంలో బుధవారం తెల్లవారుజామున కొండ చెరియలు విరిగి పడ్డాయి. దీంతో చెట్టు, కరెంట్ స్తంభం నేలకూలాయి. ఆ సమయంలో మెట్ల మార్గంలో భక్తుల సంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ తీగలు సైతం తెగి పడ్డాయి. విద్యుత్ శాఖ అధికారులు సరఫరా నిలిపి టసి మరమ్మతులు చేపట్టారు.