నార్కెట్పల్లి-అద్దంకి రాష్ట్రీయ రహదారిపై రొంపిచర్ల గ్రామ సమీపంలో గురువారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. నకరికల్లు నుంచి రొంపిచర్ల వైపు వెళ్తున్న ఓ గుర్తుతెలియని వాహనం ఓ వ్యక్తిని ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అతని శరీర భాగాలు వేరై నుజ్జు నుజ్జెయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.