రాజమండ్రి జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం నుంచి బయటపడిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. కవల గొయ్యి జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్ బస్సు వెళుతున్న సమయంలో ఓ కారు అదుపు తప్పింది, దీంతో బస్సు డ్రైవర్ చాకచక్యంగా బ్రేక్ వేయడంతో వెనుకున్న లారీ బస్సును ఢీకొంది. రెండు వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమి కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.