Araku Valley, Alluri Sitharama Raju | Aug 13, 2025
అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హార్ ఘర్ తిరంగ ర్యాలీని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ డా.కె. భరత్ కుమార్ నాయక్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ విధిగా జాతీయ జెండాను ఇంటిపైన ఎగరవేయాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం విద్యార్థులతో కళశాల నుంచి రవ్వలగుడ జంక్షన్ వరకు ర్యాలీ చేపట్టారు. సమాజంలో హర్ ఘర్ తిరంగాపై అవగాహన కలిగించడానికి ర్యాలీ చేపట్టినట్లు ఎన్ఎస్ఎస్ పివోలు నాగబాబు, విజయలక్ష్మి, అనిత కుమారి తెలిపారు.