సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ శివారులో పేకాట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. పట్టణ శివారులోని వ్యవసాయ పొలం వద్ద పేకాట ఆడుతున్నారన్న నమ్మదగిన సమాచారంతో ఆదివారం సాయంత్రం ఎస్సై వినయ్ కుమార్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 2720 రూపాయల నగదు, పేక ముక్కలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మరో ముగ్గురు పారిపోయారన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట, జూదం లాంటివి ఆడిన నిర్వహించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు .