పల్నాడు జిల్లా నరసరావుపేటలో టిడిపి కార్యకర్త యన్నం హరినాథ్ అదృశ్యంపై వస్తున్న వార్తలు వాస్తవం కాదని నరసరావుపేట రూరల్ ఎస్సై శనివారం రాత్రి 9 గంటల సమయంలో వివరణ ఇచ్చారు. హరినాధను ఎవరు కిడ్నాప్ చేయలేదని ఆయన తెలిపారు. ఒక కేసు విచారణలో భాగంగా ఏలూరు పోలీసులు హరినాధుని అదుపులోకి తీసుకున్నారని ఈ విషయం తమకు ఇప్పుడే తెలిసిందని ఎస్ఐ చెప్పారు.