టీడీపీ నాయకులు నీరుగంటి చంద్రశేఖర్ ఆదివారం మధ్యాహ్నం సోమందేపల్లి చెరువు కట్టకు పూర్వవైభవం తీసుకువస్తామని పేర్కొన్నారు. మంత్రి సవిత ఆదేశాలతో చెరువు కట్టపై ముళ్ళ పొదలను తొలగిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి విగ్రహానికి పూజలు చేసి, అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ నడింపల్లి వెంకటేష్, పట్టణ అధ్యక్షుడు సూరి, ఆయకట్టు అధ్యక్షుడు వడ్డి నారాయణ తదితరులు పాల్గొన్నారు.