మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి ఐశ్వర్య కాలనీలో టిఆర్ఎస్ నాయకులు కిన్నెర జంగయ్య పై హత్యాయత్నం జరిగింది. అక్రమ సంబంధమే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. అదిలాబాదుకు చెందిన శ్రీనివాస్ ఈ హత్యయత్నానికి పాల్పడినట్లు గుర్తించారు. శ్రీనివాస్ ఘట్కేసర్ పోలీస్స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. గాయపడిన కిన్నెర జంగయ్య మేడిపల్లి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.