అక్టోబర్ 11 12వ తేదీలలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్టియు రాష్ట్ర రెండవ మహాసభల వాల్ పోస్టర్లను బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బిఎల్టియు కార్యాలయంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా బిఎల్టియూ రాష్ట్ర అధ్యక్షులు సిద్ధిరాములు మాట్లాడుతూ.. ఈ మహాసభలకు బీడీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు.ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.