ఏలూరుజిల్లా నూజివీడు ఎంప్లాయిస్ కాలనీ లోతట్టు ప్రాంతంలో సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న శనివారం రాత్రి పరిశీలించారు. వరద ముంపునకు గురికాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రాంతంలోని పరిస్థితిని మున్సిపల్ వైస్ ఛైర్మన్ పగడాల సత్యనారాయణ వివరించారు. అనంతరం ఇరిగేషన్ అధికారుల సాయంతో ఇసుక బస్తాలు సిద్ధం చేయాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు.