Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 25, 2025
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులను జిల్లా కోర్టు సీనియర్ సివిల్ జడ్జి ఏ నాగరాజ్ పరామర్శించారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు ఆసుపత్రి చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి అక్కడి నుండి అర్బన్ పాఠశాలకు వెళ్లి స్వయంగా అక్కడి ఉన్నటువంటి మరికొంతమంది విద్యార్థులతో మాట్లాడారు. ఆ పరిసర ప్రాంతాలను కూడా ఆయన స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.