పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం వినుకొండ పట్టణంలో ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మీడియాతో మాట్లాడారు. నూజెండ్ల మండలం అన్నవరం గ్రామం నందు వైయస్సార్ సిపి నాయకులు వెంకట ప్రసాద్ పై కత్తులతో టిడిపి నాయకులు దాడి చేసినట్లుగా పేర్కొన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామంటూ తెలిపారు. లోకేష్ రెడ్ బుక్కును వినుకొండ నియోజకవర్గంలో జీవి ఆంజనేయులు పాటిస్తున్నారంటూ పేర్కొన్నారు.