సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. పట్టణంలో వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 11 రోజులపాటు ఘనంగా పూజలు నిర్వహించి శనివారం రాత్రి భక్తుశ్రద్ధలతో శోభయాత్ర నిర్వహించారు. భవానీ మందిర్ చౌరస్తా వద్ద సార్వజనిక్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వేదికను ఏర్పాటు చేసి గణనాధులకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్ పాల్గొన్నారు. పట్టణంలో నెలకొల్పిన వివిధ కాలనీల గణనాథులు ప్రత్యేక అలంకరణతో బయలుదేరాయి. ఉత్సవాల్లో మహిళలు, చిన్నారులు యువకులు బీజే డ్యాన్సులు, సాంప్రదాయ నృత్యాలు చేస్తూ సందడి చేశారు.