మండపేట మండల పరిషత్ అధ్యక్షుడు ఉండమట్ల శ్రీనివాస్ ను వైసీసీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు. మండపేట విజయలక్ష్మి నగర్ లోని వైసీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తల్లి లాంటి పార్టీకి నష్టం కలిగించే ఏ చర్యను సహించేది లేదని, పార్టీకి ద్రోహం చేస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రలోభాలు మానుకోవాలని టీడీపీ కి హితవు పలికారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు