పార్టీ నాయకులంతా ఐకమత్యంగా ఉంటూ, పార్టీ ప్రతిష్ఠను నిలబెట్టే విధంగా వ్యవహరించాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కోరారు. ఏలూరు జిల్లా పార్లమెంట్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం ఏలూరులోని క్రాంతి కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న గన్ని వీరాంజనేయులు గారు అందరినీ సమన్వయంతో నడిపించారనీ, అదేవిధంగా ఇప్పుడు ఎవరికి అవకాశం వచ్చినా, అందరం సమన్వయంతో కలిసికట్టుగా పార్టీ అభివృద్ధికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. జిల్లా పార్టీ అధ్యక్ష పదవితో పాటు, కొత్త కమిటీ ఏర్పాటు కోసం నాయకులు ఇచ్చ