సమాజ సేవ చేసే జర్నలిస్టుల ఆరోగ్యం ఎంతో ముఖ్యమని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి, జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. టి యు డబ్ల్యూ జే ఐ జే యు ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జిల్లాలోని జర్నలిస్టులకు మెగా వైద్య శిబిరాన్ని బుధవారం నిర్వహించారు.