Download Now Banner

This browser does not support the video element.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన రైల్వే కోడూరు మండలం వివి కండ్రిక గ్రామానికి చెందిన బాధితులను ఆదుకోవాలి- సిఐటియు

Kodur, Annamayya | Aug 31, 2025
అన్నమయ్య జిల్లా పీలేరు వద్ద ఇటీవల బైక్ ను కారు ఢీ కొన్న ఘటనలో గాయపడిన రైల్వే కోడూరు మండలం వివి కండ్రిక గ్రామానికి చెందిన బొజ్జ హనుమంతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆ గ్రామానికి వెళ్లిన ఆయన వారిని కలిసిన పరామర్శించిన, అనంతరం మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో తండ్రి, కుమారుడికి  కాళ్లు విరిగాయి, భార్యకు నడుము, చెయ్యి  విరిగిందని అన్నారు. గిరిజనులు, వ్యవసాయ కూలీలు అయిన వీరు ఏ పని చేసుకోలేని స్థితిలో ఉన్నారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us