Download Now Banner

This browser does not support the video element.

అంతర్రాష్ట్ర చెక్పోస్టుల వద్ద ఆకస్మిక తనిఖీలు చేపట్టిన పల్నాడు కలెక్టర్, ఎస్పీ

India | Sep 5, 2025
పల్నాడు జిల్లాలోని అంతర్రాష్ట్ర చెక్పోస్టు పొందుగల వద్ద కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు గురువారం అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. యూరియా ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా జరగకుండా ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ, ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖల సిబ్బంది పనితీరును అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించారు.రైతులకు అందాల్సిన యూరియాను అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీ స్పష్టం చేశారు. చెక్పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని జాగ్రత్తగా తనిఖీ చేయాలని, ఏ రీతినైనా యూరియా సరిహద్దు దాటి వెళ్లకుండా చూడాలని ఆదేశించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us