విశాఖపట్నంలో మంగళవారం జరుగుతున్న ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్సఫర్మేషన్ ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ సదస్సులో 20 కంపెనీలకు చెందిన సీఈఓలతో ఆయన సమావేశమయ్యారు మారిటైమ్ రంగానికి చెందిన ఆరు స్టార్ట్ప్ ల నిర్వాహకులతోను చంద్రబాబు సంభాశించారు.. స్వర్ణాంధ్ర 2047లో భాగంగా ఏపీని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్గా మార్చేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని భావిస్తున్నారు. విశాఖలో ఎయిర్ కార్గో ఫోరం ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్ను కూడా సీఎం ప్రారంభించారు.