ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి చెందిన ఘటన చేగుంట మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చిట్టోజి పల్లి గ్రామానికి చెందిన గోవర్ధన్ (32) అనే రైతు తన వ్యవసాయ పొలం సమీపంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద మంగళవారం ఉదయం జంపర్ కొడుతుండగా విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్టు స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.