అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఉన్న అత్యవసర వైద్య విభాగంలో అనంతపురం నగరంలోని గుత్తి రోడ్డులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దుర్గం భాస్కర్ అనే వృద్ధుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. సంఘటనకు సంబంధించి ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.