కలెక్టరేట్ కార్యాలయం ఎక్కడికీ తరలిపోకుండా భీమవరం నియోజకవర్గంలోనే కొనసాగుతుందని. ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, వైసిపి నాయకులు ధర్నాలు, ఉద్యమాలు చేయనవసరంలేదని ఆయన తెలిపారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు భీమవరం ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కలెక్టరేట్ను ఏఎంసీ పరిధిలోని 20 ఎకరాల్లో లేదా గునుపూడి, యనమటూరు ప్రాంతాలలో 20–25 ఎకరాలు సేకరించి నిర్మించనున్నట్లు వెల్లడించారు.