కల్లూరు మండలం పర్ల గ్రామంలో పత్తి పంటను జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పరిశీలించారు. శనివారం రైతులతో మాట్లాడి పంట స్థితి, ఖర్చులు, పత్తి దిగుబడి ఎలా ఉందని వివరాలు తెలుసుకున్నారు. రైతు మిన్నల వెల్లడించిన వివరాల ప్రకారం, 7 ఎకరాల్లో పత్తి సాగు జరుగుతోంది. ఎకరాకు రూ.40 వేల ఖర్చు అవుతుండగా, వర్షాలు సరళంగా పడటంతో పంట బాగా ఉంది. అధికారులు క్రాప్ నమోదు పూర్తిచేశారని తెలిపారు.