శ్రీ రేణుక మాత ఎల్లమ్మ ఆలయంలో బాలుడి చోరీ, సీసీ ఫుటేజ్ వీడియో మెదక్ జిల్లా రామాయంపేట లోని రైతు బజార్ శ్రీ రేణుక మాత ఎల్లమ్మ దేవాలయంలో చోరీ జరిగింది. ఆలయంలోకి చొరబడిన ఓ బాలుడు ఆలయంలోని హుండీ ధ్వంసం చేసి డబ్బులు ఎత్తుకెళ్లాడు. కాగా ఆలయంలో ఇత్తడి వస్తువులు ఎత్తుకెళ్లగా స్థానిక సీసీ కెమెరాలో రికార్డు అయింది. మంగళవారం ఉదయం చోరీని గుర్తించిన ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.