హైదరాబాద్ జిల్లా:యూరియా దొరకటం లేదని ఏదైనా చేయమని కొంతమంది బీజేపీ ఎంపీ ని అడిగారని మాజీ మంత్రి, బిఆర్ ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సోమవారం అన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ వల్ల చైనా నుంచి వచ్చే యూరియా ఆగిందని ఆ నేత తెలిపారన్నారు. ఆపరేషన్ సింధూరం వల్ల యూరియా సంక్షోభం దేశమంతా ఉండాలి కానీ ఒక్క తెలంగాణలోనే ఎందుకు ఉంటుందని కేటీఆర్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డిని కాపాడడానికి బీజేపీ వారు తాపత్రయం పడుతున్నారన్నారు.