నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 586.50 అడుగులుగా ఉందన్నారు. ప్రాజెక్ట్ అధికారులు 22 గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి దిగువనకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఇన్ఫ్లో 2,18,847 క్యూసెక్కులు కాగా అవుట్ లో 2 18,847 క్యూసెక్కులుగా ఉందన్నారు విద్యుత్ ఉత్పత్తి విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్నట్లు తెలిపారు.