విద్యుత్ షార్ట్ సర్య్కూట్ కారణంగా గడ్డివాము దగ్ధమైన ఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లా కలువాయి మండలం దాచూరులో బుధవారం జరిగింది. ఈ ప్రమాదం కారణంగా బాధితుడు శ్రీనివాసులు రూ.15 వేలు నష్టపోయినట్లు తెలిపాడు. ఆ శాఖాధికారులు స్పందించి విద్యుత్ వైర్లు సరి చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.