ఏలూరులోని విజయ విహార్ సెంటర్ లో మంగళవారం విద్యుత్ స్తంభంపై మంటలు చెలరేగాయి. విద్యుత్ వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో పెద్ద ప్రమాదం తప్పిందన్నారు.