ఖైరతాబాద్ మహాగణపతుడికి రాష్ట్ర సరి పెంచుల సంఘం నేతలు పెండింగ్ బిల్లులు చెల్లించాలని గురువారం మధ్యాహ్నం వినతిని సమర్పించారు. ఈ సందర్భంగా సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్య గౌడ్ ఆధ్వర్యంలో సర్పంచుల సంఘం నేతలు మహా గణపతికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా పెండింగ్లో బిల్లులు రాక వడ్డీలు చెల్లించలేక వాటి భారం పెరిగిపోతుందని అన్నారు. పెండింగ్ బిల్లు రాకపోవడంతో సర్పంచులే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నెలకొందని అన్నారు.