Download Now Banner

This browser does not support the video element.

భీమవరం: పట్టణంలో బైపాస్ రోడ్ రైల్వే గేట్ వద్ద పంట కాలవలో వ్యక్తి మృతదేహం కలకలం

Bhimavaram, West Godavari | Sep 13, 2025
భీమవరం బైపాస్ రోడ్‌లోని రైల్వే గేట్ సమీపంలోని పంట కాలవ వద్ద శనివారం ఉదయం 11.30 గంటలకు ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు తోట సత్యనారాయణ (45)గా పోలీసులు గుర్తించారు. నాలుగు రోజులుగా కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అన్వేషిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరణానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us