ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి అనారోగ్యాలు దరి చేరవని కళ్యాణ దుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు. కళ్యాణదుర్గంలోని బళ్లారి బైపాస్ రోడ్డులో బుధవారం నూతన డెంటల్ ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతిరోజు కనీసం రెండు సార్లు బ్రష్ చేయాలన్నారు. దంతాలు పరిశుభ్రంగా లేకపోతే రోగాలు వస్తాయన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.