విశాఖపట్నం నుంచి తిరుపతి , బెంగళూరు నగరాలకు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను నడపాలని రైల్వే శాఖకు ప్రతిపాదనలు అందాయి. ఈ ప్రతిపాదనలకు రైల్వే మంత్రి గురువారం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.ఈ కొత్త వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వస్తే, ఉత్తరాంధ్ర నుంచి తిరుమల యాత్రికులకు, అలాగే బెంగళూరు వంటి ప్రముఖ నగరాలకు ప్రయాణించే వారికి మెరుగైన సౌకర్యం కలుగుతుంది. త్వరలోనే ఈ రెండు మార్గాల్లో వందే భారత్ రైళ్లు పట్టాలెక్కే అవకాశం ఉందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు.