Download Now Banner

This browser does not support the video element.

అదిలాబాద్ అర్బన్: గిరిగాం లో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో దాడులు

Adilabad Urban, Adilabad | Sep 21, 2025
తాంసీ మండలంలోని గిరిగామలో తొడసం గోపాల్ అనే వ్యక్తి తన ఇంట్లో గంజాయి మొక్కలను సాగు చేస్తున్నట్లు జిల్లా టాస్క్ ఫోర్స్ సీఐ మురళి కృష్ణ తెలిపారు. ఆదివారం టాస్క్ ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కలిసి గోపాల్ ఇంటి వద్ద 2 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 50 వేల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. గోపాల్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ సీఐ అక్బర్ హుస్సేన్, సిబ్బంది మొహన్, రవిందర్, అరవింద్ జమీర్, శారదా, సతీష్ పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us